by సూర్య | Tue, Jan 18, 2022, 09:13 PM
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ -షార్ ఉంది. భారత్కు చెందిన ఉపగ్రహాలను ఇక్కడి నుంచే ప్రయోగిస్తారన్నది తెలిసిన విషయమే.. కరోనా మహమ్మారి ఇప్పుడు తాజాగా శ్రీహరి కోట స్పేస్ సెంటర్ పై పంజా విసిరింది. దీనితో అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా కలకలం రేగింది. 92 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక మరో పక్క నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాస్పత్రిలో కూడా కరోనా విజృభించింది. ఆరుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
Latest News