by సూర్య | Tue, Jan 18, 2022, 07:23 PM
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరగా కరనా నుంచి కోలుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబునాయుడుకు కరోనా సోకిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇలా స్పందించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు ఇవాళ కరోనా లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని నర్సీపట్నం అయ్యప్పస్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టినట్టు తెలిపారు. కరోనా నుంచి బయటపడాలని పూజలు చేశామని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అని, ఆయనకు కరోనా రావడం బాధాకరమని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చంద్రబాబుకు అయ్యప్పస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా పాలన చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.
Latest News