by సూర్య | Tue, Jan 18, 2022, 06:13 PM
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మద్దతు తెలిపారు. రివర్స్ పీఆర్సీకి నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నట్టు రఘురాం వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తన నివాసం వద్ద దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
ఉద్యోగులకు సీఎం జగన్ రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చారని దుయ్యబట్టారు. చరిత్రలో ఇలాంటి కోతలు చూడలేదని పేర్కొన్నారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితో ఉన్నాయన్నారు. ఈ విషయమై ఉద్యోగులకు సంఘీభావం తెలియజేస్తున్నానని, రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలపాలని రఘురామ్ పిలుపునిచ్చారు.