by సూర్య | Tue, Jan 18, 2022, 05:03 PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకునేందుకు జనం బారులు తీరారు. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారందరికీ ఆరోగ్య అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష నివేదికలు 12 గంటల్లో అందించబడుతున్నాయి. రోజుకు 250 నుంచి 300 మంది కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
Latest News