by సూర్య | Tue, Jan 18, 2022, 04:45 PM
ఇకపై ఏపీ లో డూప్లికేట్ ఇళ్లకు చెక్ పెట్టబోతున్నట్లు ఏపీ సీఎం జగన్ చెప్పారు. నేడు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కులు, భూ పరిరక్షణ పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు 2023 నాటికి ప్రతి గ్రామంలోని ప్రతి భూమిని సమగ్ర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేయనున్నారు. భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదు. సర్వే సమయంలోనే భూమిని కేటాయించి మండల స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కులు, భూ పరిరక్షణ పథకంలో భాగంగా 37 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ సహాయాన్ని సీఎం జగన్ నేడు ప్రారంభించారు.
Latest News