by సూర్య | Mon, Jan 17, 2022, 07:41 PM
నేడు కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంద్రా లోని వివిధ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై అధికారులు సీఎంకు వివరించారు. అన్ని జిల్లాల్లో మొత్తం 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభ్యతను మరింత పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ముందస్తు డోస్ సమయాన్ని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు. 104 కాల్సెంటర్కు కృషి చేసి టెలిమెడిసిన్ ద్వారా ఫోన్ చేసిన వారికి వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గ్రామ, వార్డు దవాఖానలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీపై పూర్తి వివరాలు తెలపాలని హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు.
Latest News