by సూర్య | Mon, Jan 17, 2022, 06:31 PM
అనంతపురంలో ని బొమ్మనవాలు మండలంలో హెచ్ ఎల్సీ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో31 మంది బొలెరో వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా ఈ హెచ్ ఎల్సీ వంతెన కూలిపోయింది. ఈ 31 మందిలో ఒకరు గల్లంతు కాగా 30 మంది రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. ఈ హెచ్ ఎల్సీ వంతెన అతి పురాతన వంతెన అని అధికారులు తెలుపుతున్నారు, ఏ ఘటనకు హెచ్ ఎల్సీ కెనాల్ అధికారుల నిర్లక్ష్యం అని బాధితులు తెలుపుతున్నారు. ఈ అతి పురాతన వంతెన పై అనుమతి ఇవ్వడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
Latest News