రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా 8 మందికి గాయాలు

by సూర్య | Mon, Jan 17, 2022, 03:43 PM

ప్రకాశం: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గుడ్లూరు మండలం సాలిపేట రావూరు మధ్యలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు. రామాయపట్నం నుంచి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో మొత్తం 8 మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM