by సూర్య | Mon, Jan 17, 2022, 03:25 PM
ఏపీ సీఎం జగన్ కరోనా పై సమీక్షించారు. ఈ సమీక్ష్లలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బూస్టర్ డోస్ వ్యవధి 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల్లో 54 వేల పడకలు సిద్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైఎస్సార్కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. స్కూళ్లు, కాలేజీల పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పాఠశాలలు, కళాశాలలు కొనసాగనున్నాయి. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. బుధవారం విద్యాశాఖ అధికారులతో సీఎం సమావేశమవుతారని తెలుస్తోంది.
Latest News