by సూర్య | Mon, Jan 17, 2022, 02:38 PM
సోషల్ మీడియాలో తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు ప్రత్యక్షం కావడంతో ఓ భర్త తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఈ ఘటన జరిగింది. వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటుండగా ఆమె భర్త స్వగ్రామం గోకవరంలో ఉంటున్నాడు. వీరి పిల్లలైన ఇద్దరు కుమారులు (13, 10) కుమార్తె (12) అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.శనివారం పిల్లలను చూసేందుకు వచ్చిన తండ్రి.. వారిని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి ఎలుకల మందు ఇచ్చాడు. వీరిలో ఇద్దరు పిల్లలు ఆ విషాన్ని తాగేందుకు నిరాకరించగా పదేళ్ల చిన్న కుమారుడు మాత్రం తండ్రి ఇచ్చిన ద్రావణాన్ని తాగాడు. దీంతో తండ్రి, కొడుకులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమీప బంధువుల వద్ద నుండి తన భార్య అసభ్యకర వీడియో రావడంతోనే ఆత్మహత్యయత్నం చేసినట్లు పోలీసులకు బాధితుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలను ఇంకా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా బాధితుడిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Latest News