దానితో నాకేం సంబంధం:అల్లు శిరీష్

by సూర్య | Mon, Jan 17, 2022, 02:16 PM

చాలా మంది ఆహాలో ఏదైనా స‌మ‌స్య‌ వస్తే సోషల్ మీడియాలో త‌న‌ను ట్యాగ్ చేస్తున్నారని, చాలా మంది తాను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యానని అనుకుంటున్నారని చెప్పాడు. దానితో నాకు సంబంధంలేదన్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా' ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ది అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడు అల్లు అర్జున్ ఈ ప్లాట్‌ఫాంకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. మ‌రో కుమారుడు, సినీ హీరో శిరీష్ మాత్రం 'ఆహా'కు, త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ చేసిన ట్వీట్ అభిమానుల్లో చ‌ర్చ‌కు దారితీసింది. 'ఆహా' సబ్‌స్రైబర్లు ఆ యాప్‌లో ఏమైన సమస్యలు వ‌స్తే ట్వీట్లు చేస్తున్నారు. తాను ఆ యాప్‌లో సాంకేతిక‌ సమస్యలను ఎదుర్కొంటున్నామ‌ని చెబుతూ ఓ వ్య‌క్తి తాజాగా ట్వీట్ చేశారు. ఈ స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆహా వీడియోస్‌ టీం, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన శిరీష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. చాలా మంది ఆహాలో ఏదైనా స‌మ‌స్య‌ వస్తే సోషల్ మీడియాలో త‌న‌ను ట్యాగ్ చేస్తున్నారని, చాలా మంది తాను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యానని అనుకుంటున్నారని చెప్పాడు. వినియోగ‌దారుల‌కు సంబంధించిన‌ ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను 'ఆహా' టీం ప‌రిష్క‌రించాలంటూ శిరీష్ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు హ‌ర్ట్ అవుతూ పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్ త‌మ్ముడే అయ్యుండి, ఆహాతో ఎటువంటి సంబంధం లేదంటూ ఇటువంటి ట్వీట్ ఎందుకు చేశావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆహాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అల్లు అర్జున్ ఉంటే శిరీష్ మాత్రం దానికి ఎందుకు దూరంగా ఉంటున్నాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. త‌న‌కు ఆహాకు ఎలాంటి సంబంధ‌మూ లేద‌న్నట్లు శిరీష్ చేసిన ట్వీట్ తో ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? అనే అనేక అనుమానాల‌ను నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM