by సూర్య | Mon, Jan 17, 2022, 01:52 PM
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో రాముడుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక రాముడు తలకు తీవ్రగాయమైంది దాంతోహుటాహుటిన స్థానికులు పార్వతిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News