by సూర్య | Mon, Jan 17, 2022, 01:42 PM
విశాఖ ఏజెన్సీ అరకు పాడేరులో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చేస్తున్న పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు మద్దతు తెలిపింది. ఈ మేరకు ఏఓబి ఎస్ జెడ్ సి కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట పెదబయలు మండలం నుంచి ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఓ దళం మిలీషియా సభ్యుడు మాట్లాడుతూ. ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లను సాధించడానికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏలాంటి బెదిరింపులకు ప్రలోభాలకు గురి కావద్దని ఉద్యోగుల డిమాండ్లు సాధించేందుకు రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Latest News