by సూర్య | Mon, Jan 17, 2022, 01:17 PM
గుంటూరు: వినుకొండ మండలం విటంరాజుపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ర గాయపడ్డ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామానికి చెందిన ముట్లూరి సామేలు తన భార్యను బొల్లాపల్లి పంపేందుకు వినుకొండలో దింపి తిరిగి వెళ్తూ విటంరాజుపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించబోయి అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సామేలు ను గుంటూరు ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు.
Latest News