by సూర్య | Mon, Jan 17, 2022, 12:46 PM
గుంటూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. యడ్లపాడు మండలంలోని చెంఘీజ్ఖాన్పేటకు చెందిన శ్రీపెరంబదూర్ ఆంజనేయులు(35), ఉదయలక్ష్మి దంపతులు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. వ్యవసాయం వీరి జీవనోపాధి. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఉదయలక్ష్మి ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం కొండమూరులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి గుంటూరులో ఉంటున్న ఆంజనేయులు శనివారం భార్య వద్దకు వెళ్లి తనతో రావాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించటంతో మనస్తాపం చెందిన ఆంజనేయులు పురుగుల మందు తాగి ప్రకాశం జిల్లా మార్టూరులోని ఫ్లైఓవర్ వంతెన వద్ద పడిపోయాడు. చివరిగా తన స్నేహితుడికి సమాచారం అందించటంతో విషయం అతని భార్య, కుటుంబ సభ్యులకు తెలిపాడు. అనంతరం ఆంజనేయులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. మార్టూరు ఎస్సై కె. రవీంద్రరెడ్డి కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Latest News