by సూర్య | Mon, Jan 17, 2022, 12:44 PM
గుంటూరు: తెనాలి వైకుంఠ పురం శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానం కేశఖండనశాలలో పనిచేసే ఇరువురు వ్యక్తులు ఆదివారం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనపై ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వుప్పల వరదరాజులు మాట్లాడుతూ.. పాత కక్షల నేపథ్యంలో వీరిలో ఒకరు బ్లేడుగల కత్తితో మరో వ్యక్తిపై దాడికి పాల్పడినట్టు చెప్పారు. గాయపడ్డ సదరు వ్యక్తి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారని, ఈ విషయమై ఇక్కడ పని చేసే 12 మందిలో ఎవరూ ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయలేదన్నారు. గుడి సహాయ కమిషనర్ ఎం. తిమ్మనాయుడు అందుబాటులో లేరు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఒకటో పట్టణ పోలీసులు చెప్పారు.
Latest News