by సూర్య | Mon, Jan 17, 2022, 12:43 PM
గుంటూరు: సత్తెనపల్లి- నరసరావుపేట ప్రధాన రహదారి పై మండల పరిధి మాదల వద్ద ఆదివారం రాత్రి ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన చౌదరి ముప్పాళ్ల నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి దామర్ల ఆదినారాయణ అంజమ్మ దంపతులు మరో ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. మాదల పెట్రోలు బంకు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
Latest News