పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

by సూర్య | Mon, Jan 17, 2022, 12:38 PM

గుంటూరు: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్టు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం. వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన ఎ. శ్రీనివాసరావు(45) అదే గ్రామానికి చెందిన కోడలు వరసయ్యే ఓ మహిళతో వారం క్రితం ఇంటి నుంచి వెళ్లారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆ మహిళ అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె ఇంటికి తిరిగొచ్చింది. బంధువులు, గ్రామస్థులు పలు రకాలుగా తనను వేధిస్తారని భావించిన శ్రీనివాసరావు పురుగుల మందు తాగి, ఇంటికెళ్లి కుటుంబసభ్యులతో విషయం చెప్పారు. వారు వెంటనే ఆయన్ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్టు చెప్పారు. ఆయన తండ్రి ఆదియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM