by సూర్య | Mon, Jan 17, 2022, 12:12 PM
కవిటి : మండలంలోని కుసుంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గౌరంగో బిసాయికి చెందిన 80 గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 25 గొర్రెలు చనిపోవడంతో లబోదిబో మంటున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని తనకు ఆదుకోవాలని గౌరంగో కోరుతున్నాడు. సర్పంచ్ ఊర్మిళ శివ బిసాయి, ఎంపిటిసి కర్రి పద్మావతి, సత్యనారా యణ బాధితులను పరామర్శించి, ఓదార్చారు.
Latest News