ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో దారుణం

by సూర్య | Mon, Jan 17, 2022, 11:31 AM

ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో దారుణం జరిగింది. ఆలయం వద్ద నిర్వహించిన ఉత్సవాల్లో పొటేలు తల అనుకుని మనిషి తల నరికేసిన ఘటన విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి గ్రామస్థులంతా వచ్చి దీలుబోణాలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు వదిలిన పొట్టేలును ఇదే గ్రామానికి చెందిన చలపతి నరికేందుకు ముందుకు వచ్చాడు. అతడు అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. అయితే పొట్టేలును కదలకుండా ఇదే గ్రామానికి చెందిన టి. సురేష్ పట్టుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న చలపతి పొట్టేలు తలకు బదులు సురేష్ తలపై వేటు వేశాడు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు వదిలాడు. దీంతో ఒక్కసారిగా పండగ వాతావరణం విషాదంగా మారింది. పొటేలు అనుకొని మనిషి తల నరకడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సురేష్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Latest News

 
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM
అనకాపల్లి జిల్లాలో భారీగా వైసీపీలోకి చేరికలు Sat, Apr 20, 2024, 02:05 PM