ఇంజనీరింగ్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య

by సూర్య | Mon, Jan 17, 2022, 12:19 AM

కానూరు మురళీనగర్‌కు చెందిన శిరిగిరిచైతన్య ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.ఆదివారం తల్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని తన గదిలోకి వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ కు  ఉరివేసుకుని చనిపోయాడు.తల్లి సాయంత్రం 7 గంటలకు ఇంటికి తిరిగి రాగా తలుపులు వేసి ఉండటంతో స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టిలోనికి ప్రవేశించి చూడగా కొడుకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీంతో షాక్‌కు గురైన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM