by సూర్య | Sun, Jan 16, 2022, 08:48 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2023లోనే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆ పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాకున్నా సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొలిశెట్టి సత్య ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రజల్లో ఉండని పవన్ కళ్యాణ్ ఎలా ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ‘‘పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తుంది.. ప్రజల్లో ఉంటే అధికారంలోకి ఉంటే.. ఓటుకు ఇంత డబ్బు ఇస్తే అధికారం వస్తుంది.. అనేది పాతకాలపు మాట! పవన్ కళ్యాణ్ మార్గం కూడా అధికారం వస్తుంది. మార్పు ద్వారా అధికారం వస్తుంది.. మేం లాంగ్ రూట్ తీసుకున్నాం. ప్రజల్లో కూడా పేషన్స్ ఉంది. బీరు, బిర్యానీ ఇవ్వకుండా పని చేసే పార్టీ జనసేన. మా దగ్గర చాలా మంది ఉచితంగా పని చేస్తున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు ఆయన దగ్గరే ఉన్నాను. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి రాజకీయాలే చేస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కుటుంబాల చేతిలోనే అధికారం బంధీ అయింది. కానీ, ఢిల్లీ కంటే ఏపీ ఇంకా బాగా పని చేస్తున్నాం. 2023 ఫిబ్రవరిలోనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేక ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లబోతున్నారు. కాబట్టి, 2023లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను చూస్తారు. అందులో అనుమానమే లేదు.’’ అని బొలిశెట్టి సత్య అన్నారు. బొలిశెట్టి సత్య సమాధానికి యాంకర్ కూడా అవాక్కయ్యారు. ప్రజల్లో లేని పవన్ కళ్యాణ్ ఎలా సీఎం అవుతారు.. ఎలా చెబుతున్నారండి సత్యగారు.. ఏ కాలిక్యులేషనో చెప్పండి.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలే కాలిక్యులేషన్ అని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మార్పు రాబోతోందని బొలిశెట్టి సత్య అన్నారు. ‘‘ఒక్కసారి మార్పు వచ్చిందంటే అది సాగుతుంది. డబ్బులు కూడా లేని ఓ దళిత మహిళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో సర్పంచ్ అయ్యారు. రంగస్థలం సినిమాలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ క్షేత్రస్థాయిలో మార్పు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది బయటపడింది. 2023లో జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.’’ అంటూ బొలిశెట్టి సత్య ధీమా వ్యక్తం చేశారు.
Latest News