by సూర్య | Sun, Jan 16, 2022, 11:31 AM
విశాఖపట్నం: నర్సీపట్నం అయ్యప్ప స్వామి రథయాత్ర శనివారం సాయంత్రం వైభవంగా ముగిసింది. నర్సీపట్నం అయ్యప్ప దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథ యాత్రలో మాజీ మంత్రి టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొన్నారు. రథయాత్ర అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బాణసంచా కాల్చారు. కోవిడ్ నేపాద్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి వేడుకలను రద్దు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తు రథయాత్ర నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలిపింది.
Latest News