by సూర్య | Sun, Jan 16, 2022, 11:29 AM
విశాఖపట్నం: ప్రియుడు మండలించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాకవరంలో శనివారం జరిగింది. మండలంలోని దాలింపేటకు చెందిన పొలవరపు దుర్గాదేవి(18) రోలుగుంట మండలం జె. పి. అగ్రహారానికి చెందిన దమ్ము నాగేంద్ర ప్రేమించుకోవడంతో ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా మనస్థాపానికి గురైన దుర్గాదేవి ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేశామని ఎస్ఇ రామకృష్ణారావు తెలిపారు.
Latest News