by సూర్య | Sun, Jan 16, 2022, 11:06 AM
ఉత్తరాంధ్ర ప్రజలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజికి పూర్తి స్థాయి యూనివర్సిటీ హోదాను కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు జేఎన్టీయూ -కాకినాడకు అనుబంధంగా కొనసాగిన.. విజయనగరం జేఎన్టీయూ ఇప్పుడు జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జేఎన్టీయూ-జీవీ) యూనివర్సిటీగా అవతరించింది.
Latest News