by సూర్య | Sun, Jan 16, 2022, 10:52 AM
సచివాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితా ఖచ్చితంగా ప్రదర్శించాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ సచివాలయంలో అన్ని ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారుల జాబితా ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో ఫీవర్ సర్వే ని కొనసాగించాలని, లక్షణాలు కలిగిన వారికి శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ చేయాలన్నారు. కరోనా అప్రాప్రియేట్ బిహేవియర్ ను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని తెలియజేయాలన్నారు. వ్యాక్సినేషన్ కు సంబంధించి మొదటి, రెండవ డోసు పూర్తిచేయాలని, బూస్టర్ డోసు ను కూడా పూర్తిగా చేపట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలని, వాలంటీర్లు వారంలో మూడు రోజులు అటెండెన్స్ నమోదు చేసేలా చూడాలన్నారు.
Latest News