by సూర్య | Sun, Jan 16, 2022, 10:47 AM
కృష్ణా: తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు, గంపలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో సంక్రాంతి సందర్భంలో గత రెండు రోజుల నుంచి కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు వెయ్యటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులకు కోడిపందేలు వేసుకోవడానికి సంక్రాంతికి అనుమతివ్వండి అని విజ్ఞప్తి చేశారు. తిరువూరు, గంపలగూడెం మండలాల్లో నిర్వాహకులు ప్రత్యేక బారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం వారే కాకుండా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వాహనాల్లో వచ్చి బెట్టింగ్ లు పెడుతున్నారు.
Latest News