by సూర్య | Sun, Jan 16, 2022, 10:41 AM
జీఓ నంబరు ఒకటి విడుదలపై మహిళా సంరక్షణ కార్యదర్శులు (మహిళా పోలీసులు) హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావును శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్ కార్యాలయంలో మహిళా పోలీసులు కలిసి పుష్పగుచ్చం అందజేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాండ్లకు కృతజ్ఞతలు తెలిపారు. జీఓ ఒకటి ద్వారా సచివాలయాల్లో మహిళా పోలీసులుగా పని చేస్తున్న తమను పోలీసుస్టేషను అప్పగించటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్ర మంలో పట్టణ, రూరల్ ఎస్ఏలు వీరప్రసాద్, రమేష్ లు పాల్గొన్నారు.
Latest News