by సూర్య | Sun, Jan 16, 2022, 09:51 AM
గుంటూరు: మాచర్ల నియోజకవర్గంలో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే నేతృత్వంలో భారీగా వివిధ పార్టీల నాయకులు వైసీపీలోకి చేరుతున్నారు ఇందులో భాగంగా. మండలంలోని వేపకంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పిఆర్కే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలే ప్రతిఒక్కరికి నమ్మకం కలిగిస్తున్నాయని ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని అయన అన్నారు. పార్టీలో చేరిన వారికీ పార్టీ అండగా ఉంటుందని సరైన గుర్తింపు కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు.
Latest News