by సూర్య | Sun, Jan 16, 2022, 09:44 AM
గుంటూరు: ఫిరంగిపురం లో బాల యేసు కథెడ్రల్ దేవాలయం నిర్మించి 130 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉత్సవాలు విచారణ గురువులు ఫాదర్. పామిశెట్టి బాలస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫాదర్స్ బంగ్లా నుండి గుంటూరు బిషప్ చిన్నా బత్తిని భాగయ్య ను మేళతాళాలతో దేవాలయ ప్రాంగణం వద్దకు తీసుకవచ్చారు. 350 మంది చిన్నారులు నూతనంగా సప్రసాదం తీసుకునేవారు భద్రమైన అభ్యంగము సేకరించారు. బిషప్ చిన్న బత్తిని భాగయ్య దేవాలయం నిర్మించిన డికమన్ స్వామి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం దివ్య పూజా బలి నిర్వహించారు. ఉత్సవాలలో గ్రామ క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Latest News