వైభవంగా జూబ్లీ వేడుకలు..!

by సూర్య | Sun, Jan 16, 2022, 09:44 AM

గుంటూరు: ఫిరంగిపురం లో బాల యేసు కథెడ్రల్ దేవాలయం నిర్మించి 130 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉత్సవాలు విచారణ గురువులు ఫాదర్. పామిశెట్టి బాలస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫాదర్స్ బంగ్లా నుండి గుంటూరు బిషప్ చిన్నా బత్తిని భాగయ్య ను మేళతాళాలతో దేవాలయ ప్రాంగణం వద్దకు తీసుకవచ్చారు. 350 మంది చిన్నారులు నూతనంగా సప్రసాదం తీసుకునేవారు భద్రమైన అభ్యంగము సేకరించారు. బిషప్ చిన్న బత్తిని భాగయ్య దేవాలయం నిర్మించిన డికమన్ స్వామి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం దివ్య పూజా బలి నిర్వహించారు. ఉత్సవాలలో గ్రామ క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest News

 
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM
పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 09:20 PM
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM