సంక్రాంతి సందడి:గుర్రం ఎక్కిన బాలయ్య

by సూర్య | Sat, Jan 15, 2022, 02:17 PM

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినీ హీరో, ఎమ్మెల్యే బాలయ్య బాబు ఆచారబద్దంగా గత ఆచారాలను ఆయన అస్వాధీంచారు. సంక్రాంతి పండుగ‌ను ఆయన ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకుంటున్నారు. పండుగ సంద‌ర్భంగా ఆయ‌న గుర్రంపై కూర్చొని సంద‌డి చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా బాలకృష్ణ తన అక్క పురంధేశ్వ‌రి ఇంటికి వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో ప్రకాశం జిల్లా కారంచేడులో ఉన్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా కొంద‌రు గుర్రం తీసుకురాగా దానిపై ఎక్కి బాకృష్ణ‌ గుర్రపు స్వారీ చేస్తున్నట్లు పోజు ఇచ్చారు. బాలకృష్ణ కుమారుడు నంద‌మూరి మోక్షజ్ఞ  కూడా గుర్రం ఎక్కాడు. కాగా, బాల‌కృష్ణ కారంచేడు వ‌చ్చార‌ని తెలుసుకున్న స్థానికులు ఆయ‌న‌ను చూసేందుకు భారీ సంఖ్య‌లో వ‌చ్చారు. అక్క‌డ ఉన్న గోడ‌లు ఎక్కి మ‌రీ బాల‌య్య చేసిన సంద‌డిని చూశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM