by సూర్య | Fri, Jan 14, 2022, 10:43 PM
గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి దంపతులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ వర్గాలు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. గోదాదేవి కల్యాణం అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, కల్యాణోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా హాజరైంది.
Latest News