by సూర్య | Fri, Jan 14, 2022, 10:42 PM
ఆంధ్రప్రదేశ్ లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.మరో మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Latest News