తెలుగుదేశం నేత హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్

by సూర్య | Fri, Jan 14, 2022, 10:14 PM

గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.  సిమెంట్ రోడ్డు విషయంలో తోట చంద్రయ్య, ప్రధాన నిందితుడు చింతా శివరామయ్య మధ్య మూడేళ్ల క్రితం గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. జనవరి 10న గ్రామంలోని తన మేనమామ కూతురు ఓణి కార్యక్రమానికి హాజరైన తోట చంద్రయ్య.. అక్కడికి వచ్చిన బంధువులతో కలిసి చింత శివరామయ్యను హత్య చేస్తానని చెప్పాడు.ఈ విషయం తెలుసుకున్న శివరామయ్య తన కుమారుడితో కలిసి మరో ఆరుగురితో కలిసి చంద్రయ్యను హత్య చేయడానికి ముందు హత్యకు పథకం వేశాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యపై చింతా శివరామయ్య మరో 7 మంది కత్తులతో హత్యా చేసి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులందరినీ  అరెస్టు చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM