యూనివర్శిటీలో కరోనా పాగా...సెమీస్టర్ పరీక్షలు వాయిదా

by సూర్య | Fri, Jan 14, 2022, 08:19 PM

లక్షలాది సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులతో పాటు మరణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలాగే రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. దాంతో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్నాయి. తాజాగా లక్నో యూనివర్సిటీలో కరోనా కలకలం నెలకొంది. 50 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సెమిస్టర్ పరీక్షలను యూనివర్సిటీ వాయిదా వేసింది. మూడు హాస్టల్స్‌కు చెందిన విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారు. హబిబుల్లా బాయ్స్‌ హాస్టల్లో ఉండే 32 మందికి, మహ్మదాబాద్ బాయ్స్ హాస్టల్లో ఉండే పది మందికి, లాల్ బహూదూర్ శాస్త్రీ బాయ్స్ హాస్టల్లో ఉండే ఎనిమిది మందికి కోవిడ్ సోకింది. నివేదిక గర్ల్స్ హాస్టల్లో ఉండే ఓ అమ్మాయికి కూడా పాజిటివ్‌గా తేలింది. మిగతా విద్యార్థులకు కూడా టెస్ట్‌లు నిర్వహించారు. ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులందరిని హాస్టల్లోనే ఉంచారు. వారికి సెపరేట్‌గా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే స్వల్ప లక్షణాలున్న వారు ఇంటికి వెళ్లేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. గార్డియన్స్ వస్తే వారితో పంపించేందుకు పర్మిషన్ ఇచ్చింది. విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో జనవరి 15 నుంచి జనవరి 31 మధ్య జరగాల్సిన పరీక్షలను నిలిపివేసింది. పరీక్షల కోసం కొత్త తేదీలు www.lkouniv.ac.inలో త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM