తప్పిన భారీ ప్రమాదం..బాంబు నిర్వీర్యం

by సూర్య | Fri, Jan 14, 2022, 08:18 PM

దేశంలో భారీ ప్రమాదం జరగకుండా పోలీసులు బాంబును ఛేధించారు. గణతంత్ర దినోత్సవానికి ముందు దేశ రాజధానిలో ఓ బాంబు కలకలం రేపింది. శుక్రవారం ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్‌లో ఓ అనుమానాస్పద బ్యాగ్‌లో బాంబ్‌ను పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని బాంబ్ స్క్వాడ్‌కు తెలియజేయగా అక్కడ చేరుకున్న సిబ్బంది బ్యాగును చెక్ చేసి బాంబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆ బాంబును నిర్వీర్యం చేశారు. బాంబ్‌కు సంబంధించి నమూనాలను సేకరించారు. దీనిపై సంబంధిత అధికారులు నివేదికను తయారు చేయనున్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో కేసు నమోదు చేశారు. దీంతో అధికారులు ఘాజీపూర్‌ పూలమార్కెట్‌ను ఖాళీ చేయించారు. ఇంకెక్కడైనా బాంబులున్నాయా అన్నదానిపై తనిఖీలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు. ఐఈడీని స్వాధీనం చేసుకున్నామని పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా వెల్లడించారు. రద్దీగా ఉండే మార్కెట్‌లో పాడుబడిన లెదర్ బ్యాగులో బాంబ్ ఉందని తెలిపారు. అయితే ఓ బ్యాగ్‌లో ఐఈడీ ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు ఉదయం 10:19 గంటలకు తమకు సమాచారం అందిందని చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీం బాంబును నిర్వీర్యం చేసిన అనంతరం బ్యాగును ఓ ఓపెన్ గ్రౌండ్ కు తీసుకెళ్లి ఎనిమిది అడుగుల లోతులో పాతిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఘాజీపూర్ పరిసర ప్రాంతాలను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీం పూర్తిగా చుట్టుముట్టింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM