by సూర్య | Fri, Jan 14, 2022, 06:55 PM
రామ మందరి నిర్మాణంపై సాగుతున్న తీరుపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. అయోధ్యలో రామ జన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణం వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయంలోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి దారితీసే రోడ్డు మార్గం తదితర అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు. ఈ వీడియోను 3డీ యానిమేషన్ విధానంలో రూపొందించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.
Latest News