అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు

by సూర్య | Fri, Jan 14, 2022, 01:49 PM

విశాఖపట్నం: సంక్రాంతి పండగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా పాల్గొన్నా మూడు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుందని నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన నర్సీపట్నంలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రజలు సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోడిపందాలు పేకాట నియంత్రణకు మండల స్థాయిలో అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గట్టి నిఘాను కూడా ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.

Latest News

 
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా,,,,తిరుపతి నుంచి విజయవాడ వరకు జర్నీ Sat, Dec 02, 2023, 09:24 PM
ఏపీలో రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ Sat, Dec 02, 2023, 08:18 PM