ఇళ్ల నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలి: కలెక్టర్

by సూర్య | Fri, Jan 14, 2022, 01:05 PM

అనంతపురం: నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద జగనన్న కాలనీలలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోపు బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఔట్ ను జాయింట్ కలెక్టర్ ఏ. సిరి తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. జగనన్న కాలనీ లో విద్యుత్ సరఫరా, నీటి వసతి, తద్వారా అన్ని రకాల మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలన్నారు.

Latest News

 
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM