by సూర్య | Fri, Jan 14, 2022, 01:05 PM
అనంతపురం: నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద జగనన్న కాలనీలలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోపు బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఔట్ ను జాయింట్ కలెక్టర్ ఏ. సిరి తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. జగనన్న కాలనీ లో విద్యుత్ సరఫరా, నీటి వసతి, తద్వారా అన్ని రకాల మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలన్నారు.
Latest News