by సూర్య | Fri, Jan 14, 2022, 01:02 PM
అనంతపురం: పరిగి మండలం విట్టపల్లి లో నీటి గుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు మేరకు హిందూపురం కు చెందిన అనిల్(28) తల్లిదండ్రి చిన్నతనంలోనే మృతి చెందడంతో విట్టపల్లిలోని వారి అక్క వారి ఇంట్లో ఉంటున్నాడు. గత మూడు రోజుల క్రితం బహిర్భూమికి వెళ్లి నీటి కుంటలో కాలుజారి పడిన మృతి చెందిననట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Latest News