అక్క ఆడపడుచుతో ప్రేమ.. చివరకు..!

by సూర్య | Fri, Jan 14, 2022, 12:13 PM

అక్క ఆడపడుచుతో ఓ యువతి ప్రేమలో పడ్డ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. పెద్దలు వారించినా వినకుండా ఆ ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. సర్దిచెబుదామనుకున్న పోలీసుల మాట కూడా కాదనడం వారు కూడా చేతులెత్తేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..హరియాణాలోని జింద్‌ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రాజస్థాన్ రతన్‌గఢ్‌లోని తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. అక్కడ ఆమె అక్క ఆడపడుచుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారించారు. వీరు కలవకుండా అడ్డుకున్నారు. అయితే గతేడాది నవంబరులో రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఇంట్లో నుంచి పారిపోయి హరియాణాలోని అదంపుర్‌ మండీకి చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. ఫతేబాద్‌లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. గత రెండు నెలలుగా కలిసే ఉంటున్నారు. కాగా, తన కూతురు కనిపించడం లేదని రతన్‌గఢ్‌లో యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు వీరిని వెతికి పట్టుకున్నారు. నిర్ణయం మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోలేదు. కలిసే ఉంటామని చెప్పడంతో చేసేదేమి లేక వారిని పంపించేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM