by సూర్య | Fri, Jan 14, 2022, 12:13 PM
అక్క ఆడపడుచుతో ఓ యువతి ప్రేమలో పడ్డ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. పెద్దలు వారించినా వినకుండా ఆ ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. సర్దిచెబుదామనుకున్న పోలీసుల మాట కూడా కాదనడం వారు కూడా చేతులెత్తేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రాజస్థాన్ రతన్గఢ్లోని తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. అక్కడ ఆమె అక్క ఆడపడుచుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారించారు. వీరు కలవకుండా అడ్డుకున్నారు. అయితే గతేడాది నవంబరులో రతన్గఢ్కు చెందిన యువతి ఇంట్లో నుంచి పారిపోయి హరియాణాలోని అదంపుర్ మండీకి చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. ఫతేబాద్లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. గత రెండు నెలలుగా కలిసే ఉంటున్నారు. కాగా, తన కూతురు కనిపించడం లేదని రతన్గఢ్లో యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు వీరిని వెతికి పట్టుకున్నారు. నిర్ణయం మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోలేదు. కలిసే ఉంటామని చెప్పడంతో చేసేదేమి లేక వారిని పంపించేశారు.
Latest News