ఒమిక్రాన్ పేరుతో సైబర్ దాడి: అప్రమత్తంగా ఉండాలని సూచన

by సూర్య | Thu, Jan 13, 2022, 09:12 PM

కరోనా దాడి.. మరోవైపు ఒమిక్రాన్ విజృంభన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు ఎక్కువగా ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఇదే అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా శరవేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్వేరియంట్ తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. సోషల్ మీడియాలోనూ ఇది ట్రెండింగ్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పేరుతో హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్న విషయం వెల్లడైంది. ఈ క్రమంలో ఫోర్టిగార్డ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆసక్తికర అంశాలను పంచుకుంది. హ్యాకర్లు రెడ్ లైన్ మాల్వేర్ ను ఈ-మెయిల్స్ ద్వారా ఫోన్లు, కంప్యూటర్లకు పంపుతున్నారని ఫోర్టిగార్డ్ తెలిపింది. తద్వారా పాస్డ్ వర్డ్, ఇతర కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారని పేర్కొంది. అందుకోసం 'ఒమిక్రాన్ స్టాట్స్.ఈఎక్స్ఈ' అనే ఫైల్ నేమ్ తో ఈ ఆయా వ్యవస్థల్లోకి చొరబడుతున్నట్టు గుర్తించామని వెల్లడించింది. 12 దేశాలకు చెందిన ప్రజలు అధికంగా ఈ రెడ్ లైన్ మాల్వేర్ బారినపడ్డారని తెలిపింది. రెడ్ లైన్ మాల్వేర్ 2020లోనే వెలుగు చూసినా, తాజాగా ఒమిక్రాన్ పేరుతో వేగంగా వ్యాపిస్తోందని ఫోర్టిగార్డ్ పేర్కొంది. రెడ్ లైన్ మాల్వేర్ ద్వారా సేకరించే సమాచారం డార్క్ వెబ్ లో విక్రయిస్తున్నట్టు తెలిపింది. అది కూడా ఎంతో చవకగా ఓ యూజర్ సమాచారాన్ని 10 డాలర్లకు అమ్మేస్తున్నారని వివరించింది. ఒమిక్రాన్, ఇతర కరోనా వేరియంట్ల పేరుతో వచ్చే ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఫోర్టిగార్డ్ సూచించింది

Latest News

 
చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు Thu, Apr 25, 2024, 03:55 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM