by సూర్య | Thu, Jan 13, 2022, 09:11 PM
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనేమైనా తప్పు చేసి ఉంటే నిరూపించాలని పరిటాల శ్రీరామ్ అన్నారు.మా మేనమామ కమ్యూనిస్టు కృష్ణారావు పేరు మీద విమానాశ్రయంలో 200 ఎకరాలు ఉందన్నారు. అది నిరూపిస్తే.. 200 ఎకరాలు ఆర్డీటీకి అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరిట ఎన్నో ఆస్తులు ఉన్నాయని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. కాంట్రాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఎవరు మీ బినామీ కాదా అని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. పరిటాల రవికి ఎమ్మెల్యేగా కాకుండా ఇతర వ్యాపారాలు ఉన్నాయి.అతను ఆ రోజుల్లో విమానాల్లో తిరిగారు. అప్పుడే వ్యాపారాలు జరిగాయి. చాలా కష్టాల తర్వాత కోలుకుని ఆస్తులు సంపాదించాం’’ అని శ్రీరామ్ చెప్పారు. మనం ఏది కొనుగోలు చేసినా.. వ్యాపారం చేసినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను విధిస్తారు. మాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో లేఖ రాస్తే వివరాలు అందజేస్తామని ప్రకాష్ రెడ్డి సోదరులకు శ్రీరాము తెలిపారు.
Latest News