by సూర్య | Thu, Jan 13, 2022, 08:17 PM
ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 47,884 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 4,348 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. విశాఖజిల్లాలో 823 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 86 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో 100 కి పైనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 261 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఇద్దరు మృతి చెందారు.
Latest News