by సూర్య | Thu, Jan 13, 2022, 04:10 PM
విశాఖపట్నం: పెదవలస మీదుగా కొయ్యూరు రహదారి మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిందని అక్కడ ప్రయాణికుడు మర్రి ఏలియ తెలియజేయడం జరిగింది. ఇద్దరు మృతి చెందినట్లు, మిగిలిన ప్రయాణికులు విషమంగా ఉన్నారని ప్రయాణికుడు చెప్పడం జరిగింది. అంబులెన్స్ సౌకర్యం కోసం ఫోన్ చేసినప్పటికీ అందుబాటులో అంబులెన్స్ లేకపోవడంతో కొయ్యూరు బిజెపి నాయకులు అర్జున్ రెడ్డి కి, కొయ్యూరు ఎస్సై దాసరి నాగేంద్ర కి సమాచారం ఇవ్వడంతో ప్రమాదంలో మరణించిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.
Latest News