by సూర్య | Thu, Jan 13, 2022, 02:22 PM
చిత్తూరు: పలమనేరు సర్కిల్ పరిధిలో పలుచోట్ల ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులు తో పాటు వారు వాడిన పరికరాలు, కారు సీజ్ చేసినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. అయితే ఏటీఎం లో ఎలాంటి నగదు చోరీ గురి కాలేదని తెలిపారు. దొంగలు సునాయసంగాబతకడం కోసం ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ నలుగురిని గంటాకు సమీపంలో పట్టుకున్నట్టు వివరించారు. ముద్దాయిలు పెనుమూరుకు చెందిన జై రామ్ రెడ్డి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి, నారాయణ కుమారుడు నరేష్, ప్రభాకర్ రెడ్డి కుమారుడు మాధవరెడ్డి, కుప్పం గుడి పల్లికి చెందిన శ్రీనివాసులు కుమారుడు హరిని అదుపులోకి తీసుకొని విచారించగా, దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకన్నారని తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన వివరించారు.
Latest News