by సూర్య | Thu, Jan 13, 2022, 12:48 PM
తమిళనాడు పురాతన విగ్రహాలు చోరి చేసి విక్రయించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 కోట్ల రూపాయల విలువైన పురాతన విగ్రహాలను.. స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న విగ్రహాలలో చోళుల కాలం నాటి నటరాజ విగ్రహం, అరుదైన రావణ, పార్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి. మామల్లపురం ప్రాంతంలో ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారంతో ఓ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. అక్కడి నుంచి ఈ పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని కశ్మీరీ వ్యాపారి జావేద్ షాను కూడా అరెస్ట్ చేశారు.
Latest News