by సూర్య | Thu, Jan 13, 2022, 12:28 PM
కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చివరి క్షణంలో ఆ వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్ బ్రేక్ వేయడంతో అదృష్టవశాత్తు బైక్ పై ఉన్న వ్యక్తికి ఏం కాలేదు. రోడ్డుపై తగినంత స్పేస్ లేకపోవడంతో బైక్ నడుపుతోన్న వ్యక్తి చేపల ప్రాసెసింగ్ యూనిట్ గేట్ ని రాసుకుంటూ.. ఒక షాపు, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్ చేసిన విధానం చూస్తేనే ఒళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అతడు చాలా లక్కీ’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News