by సూర్య | Thu, Jan 13, 2022, 12:00 PM
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో గురువారం వర్చువల్గా సమావేశం కానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కరోనా పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. సీఎంలతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్డౌన్ కొనసాగుతోంది.
Latest News