కనీసం 27శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి

by సూర్య | Wed, Jan 12, 2022, 10:05 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదని ఆయన లేఖలో పేర్కొన్నారు. వారికి కనీసం 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వం చేసిన ప్రకటన అందరినీ నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. ఇక, 2021 అక్టోబర్ నాటికే గ్రామ సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిందని... వెంటనే వారికి ప్రొబేషన్ ఖరారు చేసి, పే స్కేల్ అమలు చేయాలని కోరారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM